
న్యూఢిల్లీ, అక్టోబర్ 11:గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీ నుంచి ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’తో పాటు ‘పల్సెస్లో ఆత్మనిర్భర్ భారత్ మిషన్’ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని వర్చువల్ మాధ్యమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులతో ముఖాముఖి సంభాషించారు.
ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాలోని లాం ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు హాజరయ్యారు. అలాగే ప్రత్తిపాడు శాసన సభ్యులు, జిల్లా అధికారులు మరియు పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాని ఈ సందర్బంగా మాట్లాడుతూ, దేశీయ పప్పుదినుసుల ఉత్పత్తిలో ఆత్మనిర్భరత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు, సాంకేతికతను అనుసంధానిస్తూ నూతన మార్గాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.






