Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

యద్దనపూడి గ్రామంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహణ

యద్దనపూడి, అక్టోబర్ 12:పర్చూరు శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారి సారధ్యంలో, నోవా అగ్రి గ్రూప్ లిమిటెడ్, ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ మరియు శంకర్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో, యద్దనపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది.

శిబిరానికి ముందు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు మరియు కీ.శే. ఏలూరి నాగేశ్వరరావు గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించిన క్యాంపు కార్యాలయ ప్రతినిధులు, స్థానిక మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

వైద్య శిబిరంలో ప్రముఖ కంటి నిపుణులు రోగులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంటి సంబంధిత వివిధ రకాల వ్యాధుల గుర్తింపు, ఉచిత కంటి పరీక్షలు, అవసరమైన వారికి మందుల పంపిణీ, ఇంకా ఆపరేషన్ అవసరమైనవారిని గుర్తించే కార్యక్రమాలు చేపట్టారు.

శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ పేర్లను నమోదు చేసుకుని, వైద్య సేవలు పొందుతున్నారు. ఉదయం నుంచి శిబిర ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద రోగుల రద్దీ అధికంగా కనిపించింది.

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని, భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button