Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

జిల్లా కలెక్టరేట్‌లో నేడు పీ.జీ.ఆర్.ఎస్ కార్యక్రమం

బాపట్ల, అక్టోబర్ 12: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నేడు బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించబడుతోంది. ఇందులో భాగంగా, ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐఏఎస్ ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా ఫిర్యాదుల అర్జీలు స్వీకరించబడతాయని కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కలెక్టరేట్‌తో పాటు, ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో మరియు మండల తహశీల్దార్ కార్యాలయాలలో కూడా తహశీల్దార్లు, ఎంపీడీవోలు ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికే ఫిర్యాదు ఇచ్చిన వారు తమ సమస్యల పరిష్కార స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని, లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకుని తమ సమస్యలకు పరిష్కారాన్ని పొందాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button