chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన దేవాంగ సంక్షేమ సంఘం

విజయవాడ, అక్టోబర్ 12:ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టి నాగశయనం ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన దేవాంగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్న ఆశయంతో, వీలైనంత త్వరగా దేవాంగ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

చేనేతలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితం అందించనున్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, వాటిని త్వరితగతిన అమలు చేయాలని కోరారు. అలాగే చేనేత వృత్తిలో ఉన్నవారికి పెన్షన్లు మంజూరు చేయాలని తెలిపారు.దేవాంగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ మాట్లాడుతూ, చేనేత వృత్తిలో ప్రధానంగా ఉన్న దేవాంగ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా న్యాయం జరగాలని, విమర్శకుల నోరిమ్మడేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీ వర్గాలు అండగా నిలుస్తున్నాయని, అందులో దేవాంగ సామాజం ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్‌లకు సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నక్కిన విజయలక్ష్మి మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయివరకు కమిటీల్లో దేవాంగ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.ఈ సమావేశంలో జాతీయ దేవాంగ ఫెడరేషన్ ఏపీ మీడియా ఇన్‌చార్జి గుత్తి త్యాగరాజు, రాష్ట్ర కోశాధికారి ఉప్పు కనకరాజు, ఉపాధ్యక్షులు మన్నెముద్దు శ్రీనివాసులు, గుంటూరు దేవాంగ సంఘ అధ్యక్షులు వేమన దుర్గారావు, కార్యదర్శి కాలేపు సత్యనారాయణ, నక్కిన వీరభద్రరావు, సీనియర్ నాయకులు మచ్చ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker