chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

బాపట్ల, జిల్లాలో ప్రజలకు నాణ్యమైన సేవలం దించి సంతృప్తి చెందాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్

బాపట్ల, జిల్లాలో ప్రజలకు నాణ్యమైన సేవలం దించి సంతృప్తి చెందాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారు లదగ్గరకు సమస్యలను చెప్పుకోవడానికి వస్తారని అధికారులు సావధానంగా విని వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన చెప్పారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రెవెన్యూ ,పోలీస్, సర్వే శాఖలకు సంబంధించి న అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని సమస్యలు పరిశీలించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. మండల స్థాయిలోప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు అందరూ తప్పనిసరిగా పాల్గొనా లని ఆయన చెప్పారు. సంతమాగులూరు మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు ఎక్కువ శాతం పెండింగ్ ఉన్నాయని వాటిని పరిష్కరించ డానికి చర్యలు తీసుకోవాలనిఆయన అన్నారు. ప్రజా సమస్యలను పరిశించడానికి తాను మారుమూల గ్రామాలకు సైతం పర్యటిస్తానని ఆయన సందర్భంగా చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కరించడం లో నిర్లక్ష్యంగా ఉన్న గ్రామీణీ నీటి సరఫరా శాఖ ఎస్.ఇ కి,ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గైర్ హజర్ అయిన ఆర్.బి శాఖ ఎస్.ఇ కి సంజాయిషీ నోటీసులు జారీ చేయవలసిందిగా అధికారులకు ఆయన సూచించారు. జిల్లాలో ప్రధానమంత్రి కుసుమ్ పధకం క్రింద 7 సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయని సబ్ స్టేషన్లు నిర్మించడానికి భూసేకరణ వేగవంతంగా చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో అల్పపీడన ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. జిల్లాలో ఈనెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు సి.పి ఆర్ వారోత్స వాలను నిర్వహించా లని కలెక్టర్ అన్నారు. అత్యవసర సమయా ల్లో ప్రజలను ప్రాణా పాయo నుండి రక్షించడానికి ప్రతి ఒక్కరూ సి.పి.ఆర్ గురించి తెలుసు కోవాలని అన్నారు. ఈసందర్భంగా చీరాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శ్రీదేవి సి.పి.ఆర్ గురించి అధికారులకు డెమోను ప్రదర్శించి చూపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, బాపట్ల రెవిన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, కె. ఆర్.సి డిప్యూటీ కలెక్టర్ ఎస్.లవన్న, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధా మాధవి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా రవాణా శాఖ అధికారి పరంధామ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker