chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

BapatlaLocal News:వైసీపీ ఆధ్వర్యంలో కల్తీ మద్యానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ – ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేత

బాపట్ల జిల్లా:వేమూరు:13-10-25:-వేమూరు నియోజకవర్గ కేంద్రంలో సోమవారం కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జి వరకూటి అశోక్ బాబు నేతృత్వంలో ఈ ర్యాలీ వేమూరు రైల్వే గేట్ నుండి స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వరకు సాగింది.

ర్యాలీ ప్రారంభంలో వైయస్సార్ విగ్రహం వద్ద జరిగిన సమావేశంలో అశోక్ బాబు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కూటమి నేతల庩**తృత్వంలోనే కల్తీ మద్యం పెద్ద ఎత్తున సరఫరా అవుతోందని ఆరోపించారు. దీని వల్ల పేదవర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, అనేకమంది ఆరోగ్యపాలవడంతో పాటు మరికొందరు ప్రాణాలు కోల్పోయారన్నారు.ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, కల్తీ మద్యం సరఫరాకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు నిరసనగా తోపుడు బండ్లపై మద్యం సీసాలు పెట్టి ప్రదర్శన చేశారు. మద్యం విక్రయానికి అనుమతించే పర్మిట్ రూంలను, గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను నిషేధించాలంటూ నినాదాలు చేశారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండేదని గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం మద్యం షాపులను తమ పార్టీ నాయకులకు అప్పగించి, లాభాల కోసం కల్తీ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.ర్యాలీ అనంతరం ఎక్సైజ్ కార్యాలయాన్ని కలిసిన నేతలు సీఐకి వినతిపత్రం అందజేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker