chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News:ఘనంగా ప్రారంభమైన ఏ.పి.ఎస్.పి.ఎఫ్ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్

గుంటూరు :నాగార్జున నగర్, అక్టోబర్ 14:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం (APSPF) రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మంగళవారం నాడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలోని క్రీడా ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఏ.పి.ఎస్.పి.ఎఫ్ డైరెక్టర్ జనరల్ డా. సి.యం. త్రివిక్రమ వర్మ ముఖ్య అతిథిగా హాజరై, ఇన్‌స్పెక్టర్ జనరల్ బి.వి. రామి రెడ్డితో కలిసి ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.ఈ క్రీడా పోటీలు ఏ.పి.ఎస్.పి.ఎఫ్ 34వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ యూనిట్లకు చెందిన సుమారు 200 మంది సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వాలీబాల్, బాడ్మింటన్, 100 మీటర్లు, 400 మీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు పందెంలు పోటీ విభాగాల్లో కొనసాగనున్నాయి.

ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ, క్రీడల ద్వారా సిబ్బందిలో క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, ఐకమత్యం పెరుగుతాయన్నారు. క్రీడల్లో గెలుపు-ఓటమి కాకుండా క్రీడాస్ఫూర్తికే అధిక ప్రాధాన్యత ఉందని స్పష్టం చేశారు. ఏ.పి.ఎస్.పి.ఎఫ్ బలోపేతానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని, నూతన నియామకాలతో నూతనోత్సాహం తీసుకొచ్చేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వానికి ఏ.పి.ఎస్.పి.ఎఫ్ పై మంచి నమ్మకం ఉందని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు.ఇన్‌స్పెక్టర్ జనరల్ బి.వి. రామి రెడ్డి మాట్లాడుతూ, త్రివిక్రమ వర్మ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాఖలో అనేక వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయని, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మినీ శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు, పదోన్నతులు, నియామకాల పట్ల కూడా పెద్దపీట వేశారని పేర్కొన్నారు.ఈ క్రీడా పోటీల్లో విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు, కమాండెంట్ డి.ఎన్.ఏ. భాషా, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్‌స్పెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. పోటీలతో పాటు పరేడ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker