ఆంధ్రప్రదేశ్గుంటూరు

GUNTUR TODAY NEWS.:డ్రైవర్లు ప్రతినిమిషం అప్రమిత్తంగా ఉండాలి..

GUNTUR TODAY NEWS.:డ్రైవర్లు ప్రతినిమిషం అప్రమిత్తంగా ఉండాలి..

వాహనాలు నడుపే సమయంలో డ్రైవర్లు ప్రతినిమిషం అప్రమత్తంగా ఉండాలని మోటర్ వెహికల్ ఇన్సెపెక్టర్ టి.రాఘవరావు అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కళాశాల నందు గుంటూరు జిల్లా రవాణా శాఖ అధ్వర్యంలో రహదారి భద్రత మాసోత్సవాలు 2025 భాగంగా జిల్లాలోని పలు కళాశాలల బస్సు డ్రైవర్లకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మోటర్ వెహికల్ ఇన్సిపెక్టర్స్ కె.మల్లీశ్వరి, ఏ.సంధ్య, జి. సౌజన్య, టి.రాఘవరావు హాజరయ్యారు. ఈ సంధర్బంగా రాఘవరావు మాట్లడుతూ రోడ్లపై వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని డ్రైవర్లకు సూచించారు. రోడ్లకు ఎడమ వైపు మాత్రమే వాహనాలు నిలపాలని తెలిపారు. యాజమాన్యలు డ్రైవర్లకు ప్రతి మూడునెలలకు ఒకసారి వైద్యపరిక్షలు నిర్వహించాలని తెలిపారు. రోడ్డుపైకి వచ్చే వాహనాలకు తప్పనిసరిగా ధృవీకరణ పత్రాలు కలిగిఉండాలని అన్నారు. రోడ్డు భద్రత మనందరి భాద్యత అని రోడ్డు భద్రత వారోత్సవాలు మనందరి మంచికోరి రవాణా శాఖ నిర్వహిస్తుందని అన్నారు. రవాణా శాఖ అందించే సూచనలు డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అనంతరం డ్రైవర్లచే రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button