Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

Udayapur news:ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు కేటాయించాలి: కేంద్రాన్ని కోరిన మంత్రి కందుల దుర్గేష్

ఉదయ్‌పూర్15-10-25:-రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటక మంత్రుల ద్వితీయ దిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు మంజూరు చేయాలంటూ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు.

Udayapur news:ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు కేటాయించాలి: కేంద్రాన్ని కోరిన మంత్రి కందుల దుర్గేష్

ఈ సమావేశంలో ఏపీ తరఫున పలు ప్రతిపాదనలు సమర్పించిన మంత్రి దుర్గేష్, తిరుపతిలో కల్నరీ ఇన్‌స్టిట్యూట్, అమరావతిలో పర్యాటక భవన్, రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తరువాత పర్యాటక భవన్ తెలంగాణలోనే మిగిలిపోయిన నేపధ్యంలో, ఆంధ్రప్రదేశ్‌కు నూతనంగా మంజూరు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

“అమరావతిలో నిర్మించబోయే ఆధునిక పర్యాటక భవన్ ద్వారా పర్యాటకులకు అవసరమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. కేంద్రం త్వరితగతిన ఆమోదం తెలపాలని కోరుతున్నాం,” అని మంత్రి దుర్గేష్ అన్నారు.ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా, తిరుపతి, విశాఖపట్నంలను ప్రపంచ పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం హామీ ఇచ్చిందని వివరించారు.ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పర్యాటక విధానం భేష్ అని కొనియాడిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్, మంత్రి దుర్గేష్ సమర్పించిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేశారు.సదస్సు అనంతరం, మంత్రి కందుల దుర్గేష్ — రాష్ట్ర టూరిజం ఎండీ ఆమ్రపాలి కాటతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ప్రత్యేకంగా కలసి, రాష్ట్రానికి మరింత సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి ఇప్పటికే కేంద్రం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఇరువురు మంత్రుల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి షెకావత్ అన్ని రాష్ట్రాల పర్యాటక మంత్రులతో గ్రూప్ ఫోటో దిగారు.


Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button