Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur News:ఇండస్ట్రియల్ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్ పోస్టర్‌ను విడుదల చేసిన కలెక్టర్

గుంటూరు, అక్టోబర్ 15:గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మంగళవారం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇండస్ట్రీ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్ పోస్టర్‌ను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు.నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్‌షిప్ సమిట్ కు ప్రాథమికంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో పోస్టర్‌ను విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమిట్ సందర్భంగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు నెల రోజుల పాటు విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు.

ఇందులో భాగంగా పరిశ్రమల ఆధునికీకరణ, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల అభివృద్ధి, శుభ్రతపై దృష్టి సారించనున్నట్టు పేర్కొన్నారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందని అన్నారు. సదస్సులో జిల్లా నుండి అధిక సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, సంస్థలు పాల్గొనాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజనీరు ఎం.డి. నజీనా బేగం, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ డా. ఎం.ఎల్. నరసింహారావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఏ. జయలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button