Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad News:కాచిగూడలో బీసీ నేతల సమవేశం – దుండ్ర కుమారస్వామికి జాతీయ పదవి

హైదరాబాద్, అక్టోబర్ 15:-దేశంలో బీసీలకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంపై జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. “సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాదు — అది భారత రాజ్యాంగం తెలిపిన హక్కు” అంటూ స్పష్టం చేశారు.శనివారం కాచిగూడలో బీసీ యువజన నేతలు, కుల సంఘాలు, న్యాయవాదులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న సమావేశంలో జాతీయ బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ జాతీయ చైర్మన్‌గా దుండ్ర కుమారస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. త్వరలో పూర్తి కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్టు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 9 అమలుపై హైకోర్టు స్టే విధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “ఇది బీసీల ఆత్మగౌరవం, సమాన హక్కుల కోసం పోరాటం. ఇక భారీ ఆందోళన తప్పదు” అని ఆయన హెచ్చరించారు.ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర బందును బీసీ సమాజం మొత్తం ఐక్యంగా మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. బందులో యువత, మహిళలు, కార్మికులు, వృత్తిదారులు, కార్పొరేట్ ఉద్యోగులు కూడా భాగస్వాములు కావాలని కోరారు.బీసీల రిజర్వేషన్లకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. “బీసీ రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని షెడ్యూల్-9లో చేర్చాలి. తద్వారా సుప్రీంకోర్టు జోక్యం లేకుండా రిజర్వేషన్లకు పూర్తి రక్షణ లభిస్తుంది. ఇది చేయకపోతే దేశవ్యాప్తంగా బీసీ సమాజం చరిత్రాత్మక ఉద్యమానికి సిద్ధమవుతుంది,” అని కుమారస్వామి హెచ్చరించారు.జేఏసీ ఏర్పాటు బీసీల కోసం సామూహిక పోరాటానికి శుభసూచికమని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా బీసీ యువత, న్యాయవాదులు, డాక్టర్లు, ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు, ఎంబీసీలు, సంచార, అర్థసంచార కులాలన్నీ “అఖిలపక్ష బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ”లో భాగస్వాములవుతాయని వివరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button