ఆంధ్రప్రదేశ్కృష్ణా
KRISHNAJILLA NEWS.:గుడివాడలో వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ..
బంగారు గొలుసు చోరీ
వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును అపహరించుకుపోయిన సంఘటన ఇది. గుడివాడ వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని రాజేంద్రనగర్ బాలాజీ అపార్టుమెంటులో నివాసం ఉండే విశ్రాంత తెలుగు పండిట్ మొక్కపాటి సత్య జ్ఞాన ప్రసూనాంబ శనివారం రాత్రి రైతుబజారుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువకుడు జొన్నపాడుకు ఎలా వెళ్లాలి అని ఆమెను అడిగాడు. ఆమె అతడికి సైగల ద్వారా సమాధానం ఇస్తుండగా.. ఆమె మెడలోని బంగారు గొలుసును అగంతుకుడు తెంచుకొని పరారయ్యాడు.
దీంతో తెగిన బంగారు గొలుసులో ఆమె వద్ద 12.5 గ్రాములు ఉండగా, దొంగ మరో 11.5 గ్రాములు గొలుసు అపహరించుకు పోయాడు. ఈమేరకు ఒన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దరాప్తు చేస్తున్నారు.