ఆంధ్రప్రదేశ్విశాఖపట్నం

VISHAKAPATNAM NEWS:రాష్ట్ర పర్యాటక రంగానికి పెట్టుబడుల వెల్లువ..

రాష్ట్ర పర్యాటక రంగానికి పెట్టుబడుల వెల్లువ..

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూలపై సంతకం చేసిన మంత్రి కందుల దుర్గేష


• రాష్ట్రంలోని విశాఖపట్టణం, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 825 రూమ్ లు ఏర్పాటుకు ముందుకొచ్చిన ఇన్వెస్టర్లు .. తద్వారా టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించిన మంత్రి దుర్గేష్

• ఉత్తరాంధ్ర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా కొనసాగిన విశాఖ ప్రాంతీయ పర్యాటక సదస్సు

• త్వరలోనే విశాఖ కేంద్రంగా క్రూయిజ్ హబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన మంత్రి దుర్గేష్.. ఎంటర్ టైన్ మెంట్, టూరిజంకు రియల్ హబ్ గా విశాఖపట్టణం మారుతుందన్న మంత్రి

• పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించామని, టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం అని తెలిపిన మంత్రి దుర్గేష్

• పర్యాటక అభివృద్ధిలో మంత్రి కందుల దుర్గేష్ చురుకైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడిన పర్యాటక సెక్రటరీ అజయ్ జైన్

VISHAKAPATNAM NEWS:రాష్ట్ర పర్యాటక రంగానికి పెట్టుబడుల వెల్లువ..

• పర్యాటక శాఖ, కార్పొరేషన్ కు మంత్రి దుర్గేష్ అద్భుతమైన సహకారం అందిస్తున్నారని వెల్లడించిన ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ

VISHAKAPATNAM NEWS:రాష్ట్ర పర్యాటక రంగానికి పెట్టుబడుల వెల్లువ..

• అరకు చలి ఫెస్టివల్ బ్రోచర్ విడుదల చేసిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

VISHAKAPATNAM NEWS:రాష్ట్ర పర్యాటక రంగానికి పెట్టుబడుల వెల్లువ..

విశాఖపట్టణంలో జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతకాలు చేశారు. సోమవారం విశాఖపట్టణంలో బీచ్‌ రోడ్‌ లోని నోవాటెల్ లో జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు 150కి పైగా ఇన్వెస్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విశాఖపట్టణం, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 825 రూమ్ లు ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. తద్వారా టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ఐదేళ్లలో రాష్ట్రంలో 50,000 రూమ్ లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అందులో భాగంగా నేడు కుదుర్చుకున్న విలువైన 6 ఎంవోయూలను తొలిమెట్టుగా భావిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా కొనసాగిన విశాఖ ప్రాంతీయ పర్యాటక సదస్సు విజయవంతం కావడంపై మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.

VISHAKAPATNAM NEWS:రాష్ట్ర పర్యాటక రంగానికి పెట్టుబడుల వెల్లువ..

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎంవోయూ చేసుకున్న 8 పర్యాటక ప్రాజెక్టులు కీలకమైనవిగా తెలిపారు. ప్రధానంగా అట్మోస్పియర్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్లు 500 రూమ్ లను విశాఖపట్టణం, తిరుపతి, అమరావతిలో కట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. సునీయశశ్రీ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు వైజాగ్ లో 75 రూమ్ లు కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. డాల్ఫిన్ ఓషియన్ క్రూయిస్ వాళ్లు వైజాగ్ పోర్టులో లగ్జరీ క్రూయిజ్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రిప్పిల్స్ అండ్ కంపెనీ వాళ్లు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మైస్ సెంటర్ అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎవరెస్ట్ ఎంటర్ ప్రైజెస్, బ్లూబే ఇన్ ఫ్రా ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్లు 100 రూమ్ లతో వైజాగ్ లో లగ్జరీ రిసార్ట్ లను కట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. రాయల్ ఫామ్స్ బీచ్ రిసార్ట్స్, హోటల్ ఎస్ పార్క్ వాళ్లు బాపట్ల జిల్లాలో 100 రూమ్ లను నిర్మించేందుకు ముందుకు వచ్చారన్నారు.

కొత్త టూరిజం పాలసీ ద్వారా జీఎస్టీ, పవర్, మున్సిపల్ కార్పొరేషన్ ఛార్జీల విషయంలో పరిశ్రమ రంగానికిచ్చే రాయితీలు పర్యాటక రంగానికి ఇచ్చేందుకు తాము సిద్ధం: మంత్రి దుర్గేష్

గతంలో టీడీపీ హయాంలో మాదిరిగా రాత్రి వేళ్లలో కొంత సమయం వరకు హోటళ్లను నడిపేందుకు అవకాశం కల్పించాలని హోటల్ అసోసియేషన్ వాళ్లు కోరారని మంత్రి గుర్తుచేశారు. దాన్ని కూడా తప్పనిసరిగా అమలుచేస్తామన్నారు. కొత్త పాలసీ ద్వారా జీఎస్టీ, పవర్ ఛార్జీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఛార్జీల విషయంలో పరిశ్రమ రంగానికిచ్చే రాయితీలు పర్యాటక రంగానికి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇన్వెస్టర్లకు ఉన్న అడ్డంకులు అధిగమించి సహకరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్పష్టమైన ప్రతిపాదనలతో ప్రాజెక్టులను తీసుకురావాలని, ఆచరణ సాధ్యం అనుకుంటే తక్షణమే అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. వేగవంతంగా పనిచేసే అధికారులు పర్యాటక శాఖలో ఉన్నారని, సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేస్తామని, ఆచరణ సాధ్యం కాకుంటే వెంటనే చెప్పేస్తామన్నారు. దరఖాస్తులు సమర్పించిన నెలరోజుల్లోనే సాధ్యాసాధ్యాలను పూర్తిగా పరిశీలించి ఎస్ ఆర్ నో చెప్పేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.స్టార్ హోటళ్లలో రూ. 66 లక్షలు గా ఉన్న లిక్కర్ బార్ లైసెన్స్ ను కట్టడం భారంగా ఉందని, అది లాభసాటిగా నడవడం లేదని దాన్ని రూ.20 లక్షలకు తగ్గించాలని కోరామన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారని వెల్లడించారు.

అద్భుత ప్రకృతి రమణీయతకు చిరునామ ఉత్తరాంధ్ర ప్రాంతం: మంత్రి కందుల దుర్గేష్

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అద్భుత ప్రకృతి రమణీయతకు చిరునామ ఉత్తరాంధ్ర ప్రాంతం అన్నారు. ఇక్కడ పర్యాటక ప్రాజెక్టులు తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతాన్ని మరింత వృద్ధి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను, వనరులను ఆయా జిల్లాల కలెక్టర్లకు చక్కగా వర్ణించారని మంత్రి దుర్గేష్ అన్నారు. నేటి సమ్మిట్ తో రాష్ట్ర పర్యాటక రంగానికి మహర్ధశ పట్టుకుందని తెలిపారు. పర్యావరణ హిత అంశాలతో నవనవోన్మేషసుందర వదనారవిందగా ఉత్తరాంధ్ర ప్రాంతం విరాజిల్లుతోందని మంత్రి దుర్గేష్ అన్నారు. అందమైన ప్రకృతి సౌందర్యం ఒకవైపు, అద్భుతమైన అటవీ సంపద మరోవైపు, సుదీర్ఘ విశాల తీరం ఇంకోపక్కన ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దృశ్యకావ్యంగా ఉందన్నారు. ఈ క్రమంలో విశాఖలో ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గడిచిన ఐదేళ్లలో గతి తప్పిన పర్యాటక రంగాన్ని పట్టాలెక్కించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇన్వెస్టర్లు తమ తమ పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సుసంపన్నం చేస్తారని భావిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే పర్యాటకాభివృద్ధి జరుగుతుందన్నారు. విజయవాడలో నిర్వహించిన సదస్సుకు అనేక మంది ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారని, వాటిని అమలు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు.పర్యాటక రంగ వృద్ధి కోసం ఇన్వెస్టర్లు తమదైన శైలిలో ఆలోచనలు పంచుకోవాలని కోరారు. వినోదంతో కూడిన పర్యాటకం ఉల్లాసాన్నిస్తుందన్నారు.

పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పన అనేది పర్యాటకాభివృద్ధికి నాందిగా, మార్పుకు తొలిమెట్టుగా భావిస్తున్నాం: మంత్రి దుర్గేష్

పర్యాటక రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించాలన్న దశాబ్దాల కోరికను పర్యాటకంపై మక్కువ ఉన్న సీఎం చంద్రబాబునాయుడు, పర్యాటకంతో పాటు పర్యావరణం బాగుండాలని కోరుకునే ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కలిసి నెరవేర్చారని అది పర్యాటకాభివృద్ధికి నాందిగా, మార్పుకు తొలిమెట్టుగా భావించాలన్నారు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటకరంగానికి ఇస్తున్నామన్నారు. ఇటీవలే నూతన పర్యాటక పాలసీ 2025-29 తీసుకువచ్చామని గుర్తుచేస్తూ ఈ సందర్భంగా శాఖాధికారులను అభినందించారు. పాలసీ అమలు ద్వారా పర్యాటకుడు నాలుగైదు రోజులు పర్యాటక ప్రాంతంలో ఉండే విధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. తద్వారా పర్యాటకుడికి ఆహ్లాదం, మధురానుభూతితో పాటు ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి పర్యాటక కేంద్రాన్ని రెండు మూడు రోజులు పర్యాటకుడు సందర్శించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker