Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్వాతావరణం📍కృష్ణా జిల్లా

Thupaan nepadhyam loతుఫాన్ నేపథ్యంలోఅగ్నిమాపక శాఖ ముందస్తు సన్నాహకాలు

కృష్ణా:గుడివాడ:28-10-25:-మొంతా తుఫాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో విపత్తు స్పందన & అగ్నిమాపక శాఖ ముందస్తు సన్నాహకాలు ప్రారంభించింది. గుడివాడ అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఆంజనేయులు నేతృత్వంలో సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు. తుఫాన్ సమయంలో అత్యవసర సేవల కోసం ఉపయోగించే ఆస్కా లైటింగ్ యంత్రాన్ని అధికారులు పరీక్షించారు.

Thupaan nepadhyam loతుఫాన్ నేపథ్యంలోఅగ్నిమాపక శాఖ ముందస్తు సన్నాహకాలు

ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు అవసరమైన యంత్రాలు, సహాయక పనిముట్లను బృందాల వారీగా సిబ్బంది సిద్ధం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏడీఎఫ్ఓ ఆంజనేయులు మాట్లాడుతూ— తుఫాను సమీపిస్తోన్న నేపథ్యంలో గుడివాడలో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని, ఇవి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

తుఫాన్ సంబంధిత సమాచారం ప్రభుత్వ బులెటిన్ ద్వారా నిరంతరం మీడియాకు చేరవేస్తామని, సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న అపోహలు, నకిలీ పోస్టులను ప్రజలు నమ్మవద్దని హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ మహబూబ్ సుభాని, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button