ఆంధ్రప్రదేశ్
మహాత్ముడి బోధనలే మార్గదర్శం.. నూరి ఫాతిమా
గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం గుంటూరు మార్కెట్ సెంటర్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహానికి గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ చార్జ్ నూరి ఫాతిమా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవభారత నిర్మాణానికి మహాత్ముడి బోధనలే ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.