Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local news:కొల్లూరులో నకిలీ విత్తనాల కలకలం – సిపిఎం, రైతు సంఘం ఆందోళన

బాపట్ల, నవంబర్ 3:-కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో నాసిరకం విత్తనాల సరఫరా కారణంగా సుమారు వెయ్యి ఎకరాల్లో వరి పంట నష్టపోయింది. ఈ ఘటనపై సిపిఎం పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బాపట్ల కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు భారీ నిరసన చేపట్టారు. పాడైన వరి కంకులను తీసుకొచ్చి ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, ప్రజాపిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్. గంగయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ, “ఎన్నారై అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నాసిరకం విత్తనాలు సరఫరా చేయడం వల్ల రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. పంట దశలోనే తెగుళ్లు రావడంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. రైతులు నెల రోజులుగా అధికారులను పలుమార్లు కలిశినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

వారు మాట్లాడుతూ, “ఎన్నారై కంపెనీ మొదట సహాయం చేస్తామని చెప్పి, ఇప్పుడు బాధ్యత తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నష్టంతో ఎక్కువగా కౌలు రైతులే దెబ్బతిన్నారు. ఒక్కో ఎకరానికి కనీసం రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. లేకపోతే తీవ్ర ఆందోళనలకు సిద్ధం అవుతాం” అని హెచ్చరించారు.జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు స్వయంగా పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి. కృష్ణమోహన్, జిల్లా నాయకులు బి. సుబ్బారావు, స్థానిక రైతులు ధూళిపాల రవి, జాలాది ధనుంజయ్ రావు, నాగళ కృష్ణ రావు, సతీష్, రత్నబాబు, అశ్విని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button