Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: గుంటూరులో తమిళనాడు బృందం పర్యటన

TAMILNADU TEEM VISIT GUNTUR

ఘన వ్యర్ధాలను పర్యావరణహితంగా నిర్వహించడానికి, నగరాల్లో డంపింగ్ యార్డ్ లు లేకుండా చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు దోహదపడతాయని తమిళనాడు మునిసిపల్ శాఖ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్(డిఎంఏ) పి.మధుసూదన్ రెడ్డి అన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టడీ టూర్ లో భాగంగా గురువారం తమిళనాడు మున్సిపల్ విభాగం నుండి గుంటూరు వచ్చిన డిఎంఏ, మదురై కార్పోరేషన్ కమిషనర్ చిత్ర విజయన్, హోసూర్ కార్పోరేషన్ ఈఈ విక్టర్ జ్ఞానరాజ్, ఏఈ (డిఎంఏ) రవి చంద్రన్ లు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నాయుడుపేటలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, గుంటూరు నగరంలోని ఎంఆర్ఎఫ్, వెట్, విండ్రో, వర్మి కంపోస్ట్ యూనిట్స్ ని పరిశీలించారు.ఈ సందర్భంగా తొలుత ప్లాంట్ సామర్ధ్యం, పనితీరు, అవసరమైన వ్యర్ధాలు, ఏఏ మున్సిపాల్టీల నుండి ఎంత చెత్త వస్తుంది, ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి అయిన విద్యుత్ వినియోగం, విక్రయాలు, వ్యర్ధాల నుండి వచ్చే బూడిద నిర్వహణ, పర్యావరణ అంశాలు తదితర వివరాలను జిందాల్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జిందాల్ ప్లాంట్ నిర్వహణలో వ్యర్ధాల తరలింపుకు గుంటూరు నగరపాలక సంస్థ నోడల్ కార్పోరేషన్ గా ఉండి, ప్రతి రోజు షుమారు 4 వందల టన్నుల వ్యర్ధాలను పంపుతున్నామన్నారు. దీని వలన గుంటూరు నగరంలో ఎక్కడా డంపింగ్ యార్డ్ లు లేకుండా వీలు పడుతుందన్నారు. అలాగే ఏటుకూరు రోడ్ లో వెట్, విండ్రో, వర్మి కంపోస్ట్ యూనిట్స్ ద్వారా ఘన వ్యర్ధాలను నిర్దేశిత ఎన్జీటి గైడ్ లైన్స్ మేరకు నిర్వహణ చేస్తున్నామని తెలిపారు.అనంతరం డిఎంఏ బృందం జిందాల్ ప్లాంట్ లోని టిప్పింగ్ ఫ్లోర్, గ్రాప్ కంట్రోల్ రూమ్, బాయిలర్స్, ప్లూ గ్యాస్ క్లీనింగ్ సిస్టం, సిబ్బంది, డీసిఎస్ కంట్రోల్ రూమ్ లు, వాటి పనితీరును అడిగి తెలుసుకొని, ప్లాంట్ కెపాసిటి, ప్రస్తుతం వస్తున్న వ్యర్ధాలు, పంపుతున్న మునిసిపాలిటీలు, రోజువారీ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వ్యర్ధాల నిర్వహణ వంటి సమగ్ర వివరాలతో డాక్యుమెంట్ అందించాలని కోరారు. అనంతరం ప్లాంట్ ఆవరణలో డిఎంఏ బృందం, నగర కమిషనర్ మొక్కలు నాటారు.పర్యటనలో ఎస్ఈ (ఇంచార్జి) సుందర్రామిరెడ్డి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్, జిందాల్ ప్లాంట్ ఏపి ప్రెసిడెంట్ ఎంవీ చారి బృందం పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button