Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: తుఫాన్ తో దెబ్బతిన్న రైతులను మోసం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

RYTHU SANGAM LEADERS VISIT FLOOD AFFECTED AREA

గుంటూరు రూరల్ జొన్నలగడ్డ గ్రామంలో దెబ్బతిన్న పత్తి పైరులను గురువారం సిపిఎం, రైతు సంఘాలు పర్యటించారు. ఈ పర్యటనలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, కంచుమాటి అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తుఫానుకు ముందు ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రులు తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రతి రైతును ఆదుకుంటామని ఆర్భాటంగా పత్రికల్లో, టీవీల్లో ప్రచారం ఉదరగొట్టారన్నారు. కానీ ఆచరణలో శూన్యంగా ఉందన్నారు. జిల్లాలో సుమారు 60 ఎకరాలు పత్తి సాగు చేయగా అందులో సగం పైగా పూర్తిగా పత్తి దెబ్బ తిన్నది అన్నారు. కానీ పంట నష్టం అంచనాల్లో ఏమాత్రం దెబ్బతిన్న ఫైర్లను పరిశీలించకుండా మొక్కుబడిగా హడావుడిగా తప్పుడు రిపోర్టులతో పంట నష్టం తయారు చేయడం జరిగింది. గ్రామంలో క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసిన దాఖలాలు లేవన్నారు. పత్తి ఊరకెత్తిపోయి పూర్తిగా దెబ్బతినగా పై ఆకుల మాత్రమే అక్కడక్కడ పచ్చగా కనిపిస్తున్నాయన్నారు. దీని పరిగణనలోకి తీసుకొని రిపోర్టులు ఇస్తున్నారు అన్నారు. ప్రభుత్వం ఇది పరిశీలించకుండా పంట నష్టం జరగలేదని ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో అధికారులు పంట నష్టం అంచనాలను వేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. మండల స్థాయిలో పత్తి కొనుగోలు కేంద్రాలు పేట్టి నిబంధనల ప్రకారం ఎనిమిది శాతం 8% మాత్రమే పరిగణలో తీసుకోవటం మార్చి, 15% నుంచి 18 శాతం వరకు తేమశాతాన్ని పరిగణలో తీసుకుంటే ఈ తుఫానుకు దెబ్బతిన్న రైతులకు కొంత మేరకు న్యాయం జరుగుతుందన్నారు. దీని ప్రకారం మద్దతు ధర ప్రకారం 8110 రూపాయలకే పాడైపోయిన పత్తి మొత్తాన్ని కొనుగోలు చేయాలన్నారు.పంటల భీమా పథకాన్ని అమలుపరచినందుకు రాష్ట్ర ప్రభుత్వమే దీనికి పూర్తిగా బాధ్యత వహించి రైతులును నష్టం నుంచి బయటపడే విధంగా చేయాలన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేయాలన్నారు.అదేవిధంగా కౌలు రైతులు కూడా గుర్తించి పంట పండించిన వారికే నష్టపరిహారం చెందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రైతులతో రైతు సంఘాలు ఆందోళన చేపడతామని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు తలసీల సుధాకర్, ఇమ్మడి నాగేశ్వరరావు, కంజుల విఠల్ రెడ్డి, బాణావత్ భద్రయ్య, జోషి లు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button