chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Nandhigama Local news:కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత…… ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

నందిగామ: దాములూరు:06-11-25:-తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల పార్టీ చూపిస్తున్న ప్రాధాన్యతకు మరొక ఉదాహరణగా జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గురువారం దాములూరులో చాటిచెప్పారు.గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త మంద రామారావు కుమారుడు మంద హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. హరికృష్ణ పార్టీ కార్యకర్తగా ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లేందుకు కృషి చేసిన వ్యక్తి. ఆయన మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఈ ఘటనపై స్పందించిన గ్రామ, మండల నాయకులు విషయాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ద్వారా పార్టీ అధిష్టానానికి తెలియజేయగా, కార్యకర్త మంద హరికృష్ణ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసింది.గురువారం దాములూరు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం కుటుంబ సభ్యులకు చెక్కును స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “కార్యకర్తలే పార్టీకి బలం… వారి సంక్షేమం టిడిపి ప్రాధాన్య విధానం. హరికృష్ణలాంటి నిబద్ధత గల కార్యకర్తలను పార్టీ ఎప్పటికీ మరవదు” అని పేర్కొన్నారు.హరికృష్ణ కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్యకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ, మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker