chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

COMMISSIONER SERPRISE VISIT SACHIVALAYAM

నగరంలోని వార్డ్ సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీదనంతో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ శ్రీనివాసరావుతోటలోని 69, 70, 71 వార్డ్ సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత హాజరు రిజిస్టర్లు తనిఖీ చేసి సచివాలయ కార్యదర్శుల హాజరు సక్రమంగా ప్రతి రోజు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ సర్వేలు లేదా ఇతర కార్యక్రమాలు ఉంటే తప్పనిసరిగా మూవ్మెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని, సెలవులు తమ నోడల్ లేదా విభాగ అధికారి ద్వారా మంజూరు చేసుకోవాలన్నారు. కార్యదర్శులు ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించకుంటే చర్యలు తప్పవన్నారు. స్థానిక సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి సచివాలయం పరిధిలోనే చర్యలు తీసుకోవాలని, అప్పుడే సిబ్బంది స్థానికులకు సత్సంబంధాలు ఉంటాయన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ప్రజల సర్వీస్ రిక్వస్ట్ లు పెరగాలన్నారు. ప్రతి కార్యదర్శి తమ విభాగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసుకోవాలని తెలిపారు. అనంతరం నల్లచెరువు, ఐపిడి కాలనీ, కొబ్బరికాయల సాంబయ్య కాలనీ, పట్నం బజార్ ల్లోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను తనిఖీ చేశారు.పర్యటనలో కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker