chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Supream court CJI:సుప్రీంకోర్టు సీఎజె బి.ఆర్.గవాయి పై దాడికి నిరసనగా – “హలో దలిత్… చలో ఢిల్లీ” పిలుపు

విజయవాడ, నవంబర్ 8 (భీమోదయం):-సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈనెల 20న న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద “హలో దలిత్ – చలో ఢిల్లీ” పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ ప్రకటించారు.శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం ప్రజాస్వామ్యానికి నల్లమచ్చగా అభివర్ణించారు. ఈ దాడికి పాల్పడిన సనాతన మనువాది రాకేష్ కిషోర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

“ఇది కేవలం గవాయి గారిపై దాడి మాత్రమే కాదు, దళిత సమాజం మీద జరిగిన దాడి. న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు,” అని బ్రహ్మయ్య మాదిగ స్పష్టం చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కేవలం సానుభూతి ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు.దేశ రాజధానిలో జరగనున్న నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, దళిత సంఘాలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లంక బుజ్జి మాదిగ, టిడిపి రాష్ట్ర నాయకులు పరిశిపోగు రాజేష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, కె. శీను మాదిగ, బి. రాజు మాదిగ, మాతంగి సంజయ్ మాదిగ, బి. లలితా మాదిగ, కె. బెహార్డ్, కె. వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker