
అమరావతి: నవంబర్ 10 :-రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశగా అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్ను తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందడుగు వేశారు. సోమవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి పై సమీక్ష నిర్వహించారు.సమావేశంలో సీఎస్ కె.విజయానంద్తో పాటు ఆర్థిక, పర్యాటక, పారిశ్రామిక, రవాణా, ఐటీ, మున్సిపల్, వ్యవసాయ, ప్రణాళికా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విశాఖ ఎకనామిక్ రీజియన్ను రాష్ట్రానికి “గ్రోత్ హబ్”గా మలచే అవకాశాలపై ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ విస్తరించే తీర ప్రాంత జిల్లాలను సమన్వయం చేస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు.ఈ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, జీవన ప్రమాణాలు, సుస్ధిరాభివృద్ధి వంటి అంశాలను సమగ్రమైన రీతిలో విశ్లేషించి “ఎకనామిక్ మాస్టర్ ప్లాన్”ను రూపకల్పన చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశాఖ ఎకనామిక్ రీజియన్ కొత్త దిశలో మైలురాయిగా నిలవాలని సీఎం అభిప్రాయపడ్డారు.







