chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍గుంటూరు జిల్లా

Guntur nagaram lo:-గుంటూరు నగరంలో ₹66.38 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం-మేయర్ కోవెలమూడి రవీంద్ర

గుంటూరు: నవంబర్ 10 :- గుంటూరు నగరంలోని పలు డివిజన్లలో సుమారు ₹66.38 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని నగర పాలక సంస్థ స్థాయి సంఘం ఆమోదం తెలిపింది. సోమవారం మేయర్ ఛాంబర్‌లో జరిగిన స్థాయి సంఘ సమావేశంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన ఈ నిర్ణయం తీసుకున్నారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, స్థాయి సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.సమావేశంలో నగరంలోని వివిధ డివిజన్లకు సంబంధించిన మొత్తం 173 అభివృద్ధి అంశాలపై విపులంగా చర్చించి ఆమోదం తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి పైపులైన్లు, గ్రీనరీ వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించినట్లు మేయర్ రవీంద్ర తెలిపారు.

మేయర్ మాట్లాడుతూ, “గుంటూరు నగరంలో కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు, విలీన గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. పలు పనులకు ఇప్పటికే శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి,” అన్నారు.ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా ప్రతినిధులు మరియు ఉన్నతాధికారుల క్షేత్ర స్థాయి పర్యటనల్లో గుర్తించిన అవసరాల ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో ఆమోదించామని ఆయన పేర్కొన్నారు.సమావేశంలో స్థాయి సంఘ సభ్యులు ఈరంటి వరప్రసాద్, షేక్ మీరావలి, కొమ్మినేని కోటేశ్వరరావు, దాసరి లక్ష్మి దుర్గ, ముప్పవరపు భారతి, నగర పాలక సంస్థ వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker