chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

chirala pattanam lo:-చీరాల పట్టణంలో శక్తి బృందం వారు విద్యార్థులకు సోషల్ మీడియా అవగాహన కార్యక్రమం

చీరాల: నవంబర్ 11:-బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ గారి సూచనలతో చీరాల సబ్‌డివిజన్ శక్తి బృందం ఆధ్వర్యంలో ఆమోదగిరిపట్నం జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెడబలమి శేఖర్‌రావు అధ్యక్షత వహించగా, చీరాల వన్‌టౌన్ సీఐ సుబ్బారావు ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. శక్తి బృందం ఎస్‌ఐ ఎ. హరిబాబు, పిసి కే. సుబ్బారావు, సునీత, ధనలక్ష్మి లు విద్యార్థులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

chirala pattanam lo:-చీరాల పట్టణంలో శక్తి బృందం వారు విద్యార్థులకు సోషల్ మీడియా అవగాహన కార్యక్రమం

ఈ సందర్భంగా ఎస్‌ఐ హరిబాబు మాట్లాడుతూ, శక్తి యాప్ అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు వంటి నేరాలను అరికట్టడంలో ఈ యాప్ కీలకపాత్ర వహిస్తుందని తెలిపారు.అలాగే విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ, ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే తల్లిదండ్రులకు లేదా పాఠశాల గురువులకు తెలియజేయాలని సూచించారు.సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, సోషల్ మీడియా వేదికల్లో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో వస్తున్న ఫేక్ న్యూస్‌లకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు హెచ్చరించారు.ఏదైనా సమస్య తలెత్తినప్పుడు హెల్ప్‌లైన్ నంబర్లు 100, 112కు కాల్ చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.కార్యక్రమంలో పిటి మాస్టర్ పల్లపోలు మధుబాబు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం బి. శివప్రసాద్, ఉపాధ్యాయులు కే. సుధాకర్‌రావు, వై. రత్నం తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker