Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Montha thupaan : ముంతా తుఫాన్ సమస్యలను పరిష్కరిచాలి- సిహెచ్.మణిలాల్ పిలుపు

బాపట్ల:రేపల్లె :11-11-25:-రేపల్లె పట్టణంలో ముంతా తుఫాన్ కారణంగా పేదల నివాస ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్. మణిలాల్ డిమాండ్ చేశారు.గ్రీవెన్స్ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ (పాత జగన్ కాలనీ), 20వ వార్డు ఐబీపీ పెట్రోల్ బంక్ వెనుక కాలనీలలో ఇప్పటికీ వర్షపు నీరు నిల్వ ఉందని, డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వీధుల్లో నీరు నిల్వ ఉండటంతో పాముల భయం, దోమల ఉత్పాతం, దుర్వాసనల వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, పట్టణంలో పారిశుధ్య పనులు, బ్లీచింగ్ సక్రమంగా నిర్వహించలేదని మణిలాల్ విమర్శించారు.

పునరావాస కేంద్రాల్లో పేర్లు నమోదైన అర్హులకు నష్టపరిహారం ఇవ్వడంలో రాజకీయ జోక్యంతో అర్హులను తొలగించారని ఆయన తెలిపారు. వితంతువులు, వికలాంగులు వంటి ఆధారరహిత కుటుంబాలకు కూడా నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.అధికారులు స్థానిక నాయకుల ఒత్తిడికి లొంగి డాక్యుమెంట్లు తీసుకున్నా నష్టపరిహారం ఇవ్వకపోవడం విచారకరమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మణిలాల్ డిమాండ్ చేశారు.పేదప్రజలు నివాసమున్న ప్రాంతాల్లో తక్షణం నీరు తొలగించి, బ్లీచింగ్ నిర్వహించి, రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు, సిపిఎం నాయకులు వి. ధనమ్మ, కే. నాంచారమ్మ, ఎం.డి. ఫర్జానా, కె. సింధుదేవి, డి. అగస్టీన్, కే. ఆశీర్వాదం, బి. రాము తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button