Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా గుంటూరు రైల్వే స్టేషన్, APSRTC బస్టాండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు

POLICE INSPECTION IN GUNTUR

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడు ఘటన దృష్ట్యా, జిల్లా పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేస్తూ, జిల్లా వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, ప్రజా రక్షణ కొరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈమేరకు జిల్లా అదనపు ఎస్పీ ఏ. హనుమంతు ఆధ్వర్యంలో, జిల్లా భద్రత విభాగం (District Security Wing) ఆధ్వర్యంలో గుంటూరు రైల్వే స్టేషన్, APSRTC బస్టాండ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీలను ప్రేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, ఇతర ప్రమాదకర పదార్థాల గుర్తింపు మరియు నిర్వీర్యం చేసే శిక్షణ పొందిన పోలీస్ సిబ్బంది, ప్రత్యేక జాగిల బృందాలతో కలిసి నిర్వహించారు. గుంటూరు రైల్వే స్టేషన్ లో అదనపు ఎస్పీ ఏ. హనుమంతు, కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి, జిల్లా ఎం.టి. ఆర్‌.ఐ. శ్రీహరి రెడ్డి, ప్రభుత్వ రైల్వే పోలీస్ RSI జ్యోతి, ఇతర అధికారులు, జిల్లా భద్రత విభాగం సిబ్బంది స్వయంగా పాల్గొన్నారు. ఈ తనిఖీలలో రైల్వే స్టేషన్ పరిసరాలు, తినుబండారాల దుకాణాలు, ఇతర స్టాళ్లు, ప్రయాణికుల సామాను, ఆటో స్టాండ్, బైక్ స్టాండ్ ప్రాంతాలను బీడీ (Bomb Detection) టీమ్ మరియు పోలీస్ జాగిలాలతో పూర్తిగా పరిశీలించారు. ఏవైనా అనుమానిత పదార్థాలు, వస్తువులు లేదా అనుమానిత వ్యక్తులు ఉన్నారేమో అనే దృష్ట్యా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా, APSRTC బస్టాండ్ లో జిల్లా వెల్ఫేర్ ఆర్‌.ఐ. సురేష్ ఆధ్వర్యంలో, జిల్లా భద్రత విభాగానికి చెందిన శిక్షణ పొందిన జాగిల బృందాలతో కలిసి పార్సిల్ బుకింగ్ కౌంటర్లు, ప్రయాణికుల లగేజీలు, స్టాళ్లు తదితర ప్రాంతాలను పరిశీలించారు. పార్సిల్ వివరాలు, రవాణా మార్గాలు మరియు రవాణా చేసే వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి భద్రతా పరమైన చర్యలు చేపట్టారు. అనుమానిత లేదా ప్రమాదకర వస్తువుల రవాణాను అరికట్టి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా ఈ తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. ప్రజలు ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని లేదా డయల్ 112 ద్వారా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button