

క్యాన్సర్ వ్యాధితో మృతి చెందిన బాపట్ల నియోజకవర్గకవర్గ కొండుబొట్లు వారిపాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు కూనపురెడ్డి ఉమామహేశ్వరరావు జీవితంలో చివరి కోరికగా జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలవాలని ఆశపడ్డారు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే ఆయన మరణించడం జరిగింది.
ఉమామహేశ్వరరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన బాపట్ల నియోజకవర్గ జనసేన నాయకులు విన్నకోట సురేష్, వారి కుమారుడి చదువు బాధ్యతను తీసుకున్నారు. అలాగే నల్లమోతు వారి పాలెం గ్రామానికి చెందిన జనసేన నాయకులు గరిగంటి సుధీర్, గ్రామ పార్టీ అధ్యక్షులు గరిగంటి శ్రీనివాసరావు, సాయంతో కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల రూరల్ జనసేన మండల అధ్యక్షుడు దాసరి ఏసుబాబు, కర్లపాలెం మండల అధ్యక్షుడు గొట్టిపాటి శ్రీకృష్ణ, నల్లమోతు వారి పాలెం జనసైనికులు తాండ్ర రాధాకృష్ణ, సాయిన రాంబాబు, గుర్రాల వెంకట రామారావు, తదితరులు పాల్గొన్నారు.










