
Eluru:21-11-25:-పోలవరం నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రతి మంగళవారం “జనవాణి” కార్యక్రమాన్ని ఏడు మండలాల్లో నిర్వహించనున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రకటించారు.శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలరాజు అన్నారు…జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు, వెంటనే స్పందించే విధంగా మండల కేంద్రాలన్నింటిలో జనవాణి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉండటంతో త్వరితగతిన పరిష్కారాలు లభిస్తాయన్న నమ్మకం వ్యక్తం చేశారు.జనవాణి ద్వారా ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం సమస్యలు ప్రభుత్వ వ్యవస్థలకు మరింత సమర్థంగా చేరేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.










