chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: మెప్మా వార్షిక సంచిక అవని నిఆవిష్కరించిన కలెక్టర్

MEOMA PAMPLET RELESE IN GUNTUR

మెప్మా వార్షిక సంచిక ‘ అవని’ ని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోని ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో మెప్మా రూపొందించిన ‘ అవని’ వార్షిక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ‘ అవని’ సంచికలో స్పూర్తి గొలిపే గాథలు ప్రచురించడమే కాకుండా వివిధ జిల్లాల్లో మహిళా సంఘాలు సాధించిన విజయ గాథలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మహిళ పారిశ్రామిక విప్లవానికి గట్టి పునాదులు పడుతున్నాయన్నారు. ఒక కుటుంబానికి ఒక వ్యాపారవేత్త తయారుచేయాలనే ముఖ్యమంత్రి సంకల్పం. రాష్ట్రంలో మహిళ శక్తిని.. మహోన్నత శక్తిగా మార్చే ప్రక్రియకు నాంది పలికిందన్నారు. ఈ క్రమంలో ఒక్కో అడుగు వినూత్నంగా వేయడం జరుగుతుందని, మెప్మా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ… వారికి సరికొత్త అవకాశాలను చూపిస్తూ.. ముందుకు సాగుతుందని తెలిపారు. మెప్మా చేపట్టిన 9 ప్రాజెక్టులకు ఇటీవల వచ్చిన స్కోచ్ అవార్డులు మెప్మాను దేశంలోనే అగ్రగామిగా నిలిపాయన్నారు. ఇందులో జిల్లాలోని ప్రతి మహిళా సంఘం వినూత్న రీతిలో కార్యకలాపాలు చేపడుతూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ లు గంగ రాజు, లక్ష్మి కుమారి, శ్రీనివాస్, మెప్మా పిడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker