chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)

YSR Kadapa News: రాళ్ళతో కొట్టి చంపడానికి పర్మిషన్ ఇవ్వండి-వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం గురుపత్ని మారుతి మహాలక్ష్మి

వైఎస్సార్ కడప జిల్లా: బి.మఠం:25-11-25:-సోషల్ మీడియా వేదికగా గత నాలుగేళ్లుగా తనపై జరుగుతున్న అసభ్య, అమానవీయమైన ప్రచారాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, తనను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలని గురుపత్ని మారుతి మహాలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు హోమ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్, గవర్నర్‌కు వినతులు సమర్పించినట్లు ఆమె తెలిపారు.వెంకటాద్రి స్వామి, దత్తాత్రేయ స్వామి, PPN ప్రసాద్, వెంకటాద్రి స్వామి మేనమామ పర్లకొండ చంద్రశేఖర్, సన్నబోయిన శ్రీనివాస్, పొన్నేకంటి శ్రీనివాసచారి లు తనపై అసభ్యంగా, జుగుప్సాకరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలోనే ఈ విషయమై జిల్లా SPకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

గత నాలుగేళ్లుగా మానసికంగా వేధింపులకు గురవుతున్నాను. 2024 మార్చిలో SPకి ఫిర్యాదు చేసాను. స్పందన లేకపోవడంతో కలెక్టర్, DIG, అదనపు DGP, DGPలకు కూడా పంపాను. ఫలితం లేకపోయింది” అని మారుతి మహాలక్ష్మి తెలిపారు.2024 నవంబర్ 8, 9 తేదీల్లో మహిళలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్న హోమ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూసి ధైర్యం వచ్చినట్టు చెబుతున్నారు. అందుకే 11.11.2024న ఇద్దరికీ ఫిర్యాదు చేయగా, అది మళ్లీ SP కార్యాలయానికి మార్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు.తాజాగా 11.11.2025న ప్రత్యర్థులు మరోసారి అదే అసభ్య ప్రచారం చేసినట్లు పేర్కొంటూ, 13.11.2025న SPకి మరోసారి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.“నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ మానసిక వేదన కన్నా చావడం మేలు. నన్ను ఒకేసారి రాళ్లతో కొట్టి చంపేందుకు నిందితులకు అనుమతి ఇవ్వాలి. కొట్టే వారికి భద్రతా ఏర్పాటు కూడా చేయాలి” అని విన్నపం చేసానని మారుతి మహాలక్ష్మి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా తెలియజేశానని వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker