chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Bulinding workers Union: బిల్డింగ్ వర్కర్ యూనియన్ సంక్షేమ బోర్డు ను పునరుద్ధరించాలని-ప్రధాన కార్యదర్శి చీర్ల రామస్వామి డిమాండ్

విజయవాడ: నవంబర్ 26:-విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున నగర ప్రధాన కార్యదర్శి చీర్ల రామస్వామి కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని, అలాగే నిల్వలో ఉన్న సుమారు 45 వేల క్లైములను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.భాను నగర్‌లో బిల్డింగ్ వర్కర్ల సమస్యలను తెలుసుకునేందుకు యూనియన్ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా సంక్షేమ బోర్డు పునరుద్ధరణ కోసం సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఒక పూట పని దొరికినా, మరో పూట పని లేక కుటుంబాలు బాదరబందిగా పోతున్నాయని, పిల్లల ఆహార సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు రామస్వామికి విన్నవించారు.“సంక్షేమ బోర్డు ఉంటే యూనియన్ కార్డు ఆధారంగా లభించే క్లైములు మా కుటుంబాలకు ఆదుకుంటాయి” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

యూనియన్ నగర అధ్యక్షుడు బెవర శ్రీనివాసరావు మాట్లాడుతూ —“భవన నిర్మాణ కార్మికుల జీవనోపాధి రోడ్ల మీద పడిపోయిన ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఆకలి మంటలు అగ్గిపెట్టెలా రగలకముందే బోర్డు చైర్మన్‌ను నియమించి, నిర్మాణ కార్మికుల సమస్యలను శీఘ్రం పరిష్కరించాలి” అని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో చల్లా వెంకటరమణ, రెడపంగు ప్రభుదాస్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker