chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

NMMS: Excellent NMMS: Flawless NMMS Exam Management for the Future of 12,000 Scholarships||అద్భుతమైన NMMS: 12,000 ఉపకార వేతనాల భవిష్యత్తు కోసం పకడ్బందీ NMMS పరీక్ష నిర్వహణ

NMMS: Excellent NMMS: Flawless NMMS Exam Management for the Future of 12,000 Scholarships||అద్భుతమైన NMMS: 12,000 ఉపకార వేతనాల భవిష్యత్తు కోసం పకడ్బందీ NMMS పరీక్ష నిర్వహణ

జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు.

      జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పరీక్షలు ఈనెల 7వ తేదీన ఆదివారము జరుగుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ పరీక్ష ఉదయము10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరగనున్నాయని ఆయన తెలిపారు.ఈ పరీక్షలకు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని, పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలు అందజేస్తారని ఆయన తెలిపారు.జిల్లాలో బాపట్ల, చీరాల, రేపల్లె  రెవెన్యూ డివిజన్ల  పరిధిలో 11 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. 2,412 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుగుతున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష నిర్వహణలో  ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, చీఫ్ సూపరింటెండెంట్లను, రూట్ అధికారులను మరియు కస్టోడియళ్లను నియమించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రాథమిక వైద్యం అందించడానికి ప్రతి పరీక్షా కేంద్రంలో  ఏఎన్ఎం లను నియమించామన్నారు. పరీక్షలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ బస్సులు నడపాలని, విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు  మూసి వేయించాలన్నారు. పోలీసుల బందోబస్తు నిర్వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి శానిటేషన్ చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.పరీక్షలు సమర్థంగా నిర్వహించడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ పరీక్షలకు సంబంధించి బాపట్ల జిల్లా లోని పరీక్ష కేంద్రాల వివరాల పట్టిక ఈ క్రింద జత పరచడమైనది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker