chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Parchuru Local news :ఏడు దేవాలయాల పునర్నిర్మాణానికి రూ.8.40 కోట్లు సిజిఎఫ్ నిధులు-ఎమ్మెల్యే ఏలూరి

Bapatla:పర్చూరు :04-12-25:-పర్చూరు నియోజకవర్గం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేస్తున్న కృషికి ప్రభుత్వం మద్దతు లభించింది. ఆయన ప్రత్యేక సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు పురాతన దేవాలయాల పునర్నిర్మాణానికి సిజిఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) ద్వారా మొత్తం రూ.8.40 కోట్లు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిధులతో నియోజకవర్గంలోని పలు ఆలయాలు పునర్వైభవాన్ని సంతరించుకోనున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి :పర్చూరు వేణుగోపాలస్వామి ఆలయం – రూ. 1.75 కోట్లుభీమేశ్వరాలయం – రూ. 1.50 కోట్లుదేవరపల్లి వేణుగోపాలస్వామి ఆలయం – రూ. 1.00 కోట్లుగర్నెపూడి విగ్నేశ్వర, విశ్వేశ్వర ఆలయాలు – రూ. 1.00 కోట్లుఅనంతవరం వేణుగోపాలస్వామి ఆలయం – రూ. 1.05 కోట్లుసురవరపుపల్లి చెన్నకేశవ దేవాలయం – రూ. 1.05 కోట్లుసంతరావూరు శ్రీరామలింగేశ్వర ఆలయం – రూ. 1.05 కోట్లు

ఈ నిధులకు అదనంగా 33% మ్యాచింగ్ గ్రాంట్ తో ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపారు.పర్చూరు నియోజకవర్గంలో ఎన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పురాతన దేవాలయాలు తిరిగి పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తుండటంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి శ్రమిస్తున్న ఎమ్మెల్యే ఏలూరికి ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అలాగే ఈ నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డిలకు ఎమ్మెల్యే ఏలూరి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker