chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: అక్రిడిటేషన్ లకు త్వరగా దరఖాస్తు చేయాలి

I&PR RJD MEETING IN GUNTUR

జర్నలిస్ట్ ల అక్రిడిటేషన్ లకు అర్హులైన జర్నలిస్ట్ లుత్వరగా దరఖాస్తు చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్.జె.డి) టి. కస్తూరి కోరారు. శనివారం గుంటూరు సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ సందర్శనకు విచ్చేసిన ఆర్.జె.డి మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అక్రిడిటేషన్ ప్రక్రియను వివరించారు. డిసెంబరు 15 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అక్రిడిటేషన్ లు జారీ చేయుటకు సిద్ధంగా ఉండాలని సంచాలకులు ఆదేశించి ఉన్నారని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో వేగవంతం చేయడం జరిగిందని చెప్పారు. అన్ని మీడియా యాజమాన్యాలు తమ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల జాబితా అందజేసి సహకరించాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులు తమ పేరును http://mediarelations.ap.gov.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని, దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. జి.టి.పి.ఎల్ నెట్ వర్క్ లో వార్తలు ప్రసారం చేస్తున్న లోకల్ ఛానెల్ లకు, ఎం.ఎస్.ఎం.ఇ లుగా నమోదు చేసుకున్న ఛానెల్ లకు అక్రిడిటేషన్ ల మంజూరుకు అవకాశాలపై కొంత మంది మీడియా ప్రతినిధులు కోరగా, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకుల కార్యాలయంలో సంబంధిత అర్జీలు సమర్పించాలని, దానిపై వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు. అక్రిడిటేషన్ ల ప్రక్రియలో భాగంగా అందుకున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు లోచర్ల రమేష్, డివిజనల్ పి.ఆర్.ఓ జె. శ్యామ్ కుమార్, వివిధ సంస్థల మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker