chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍గుంటూరు జిల్లా

Guntur Local News :ఘనంగా సాయుధ దళాల పతాక దినోత్సవం

గుంటూరు డిసెంబరు 8: భారత సైనికుల త్యాగాలు అపారమని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా మొదటి విరాళం అందజేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ—సైనికులు కుటుంబాలను విడిచి సియాచిన్ వంటి తీవ్రమైన పరిస్థితుల్లో దేశ సరిహద్దులను కాపాడుతూ ఉన్నారని, వారి సేవలకు ప్రతి పౌరుడు రుణపడి ఉంటాడని తెలిపారు. వీరజవానులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం అందరూ విరాళాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.జిల్లాలో సాయుధ దళాల పతాక నిధికి ఈ ఏడాది ఇప్పటివరకు Rs.17,67,363 సేకరించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.పెద్ద మొత్తంలో విరాళాలు అందించిన సంస్థలు, వ్యక్తులుజిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ – ₹6.40 లక్షలుమెప్మా – ₹2.05 లక్షలువి.ఐ.టి యూనివర్సిటీ – ₹2.50 లక్షలుఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ – ₹1.30 లక్షలుడా. పి. కళావతి – ₹1 లక్షకోస్టల్ బ్యాంక్ – ₹1 లక్షమాజీ సుబేదార్ నాగమల్లేశ్వరరావు – ₹1 లక్షధిక విరాళాలు అందించిన అధికారులను కలెక్టర్ సత్కరించారు.

Guntur Local News :ఘనంగా సాయుధ దళాల పతాక దినోత్సవం

వీరమరణం పొందిన జవాను కుటుంబానికి సాయం2023 అక్టోబర్ 17న ఉత్తరాఖండ్‌లో ఆపరేషన్ స్నో లెపర్డ్‌లో విధుల్లో ఉన్నప్పుడు ప్రమాదంలో మరణించిన చిట్టుమడుగుల వాసు కిషోర్ భార్య చిట్టుమడుగుల నవీనను కలెక్టర్ సత్కరించారు. వారికి ఏటుకూరు గ్రామంలో 300 గజాల హౌస్ సైట్ మంజూరు చేశారు.విరాళాల చెల్లింపు వివరాలు విడుదలజిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్. గుణశీల ప్రకారం, విరాళాలు ఆన్‌లైన్ ద్వారా లేదా చెక్కు ద్వారా అందించవచ్చని తెలిపారు.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయవాడకరెంట్ అకౌంట్ నం.: 33881128795
IFSC: SBIN0016857MICR: 520002046
జిల్లా సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తూ, సైనిక సంక్షేమ కార్యాలయానికి దారి సమస్య పరిష్కారం, మాజీ సైనికులకు కనీసం 175 గజాల స్థల కేటాయింపు కోరారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్డీవో శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker