chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి-జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్

బాపట్ల : 8-12-2025:-జిల్లా ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు సమయానుసారంగా, చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.జిల్లా నలుమూలల నుండి అందుతున్న అర్జీలను అధికారులు నిల్వ పెట్టకుండా వెంటనే స్పందించాలని సూచించారు. ఆన్లైన్‌లో పంపిన అర్జీలను కొంతమంది అధికారులు ఇప్పటికీ పరిశీలించడం లేదని గుర్తించిన కలెక్టర్, ఇలాంటి నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Bapatla Local News :ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి-జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్

మండలం, విభాగాల వారీగా అర్జీల పరిశీలనలో మార్టూరు మండలానికి అధిక అర్జీలు రావడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఫ్రీ ఆడిట్ వ్యవస్థలో కొన్ని మండలాల పనితీరు సంతృప్తికరంగా లేకపోవడంతో, వాటిని జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్య ప్రముఖుల నుండి వచ్చే అర్జీలను అత్యవసరంగా పరిష్కరించాలని సూచించారు.అర్జీల పరిష్కారంలో నాణ్యమైన ఎండార్స్మెంట్ ఇవ్వాలి. ఒక సమస్య పునరావృతం కాకుండా అర్జీదారునికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, కార్యాలయాల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.

Bapatla Local News :ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి-జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్

ఈ నేపథ్యంలో అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు స్పందించని అధికారులపై క్రమశిక్షణా చర్యలు ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాను మూడో స్థానం లేదా అంతకంటే మెరుగైన స్థాయిలో నిలపడం కోసం అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ విజయమ్మ, పీడీ డిఆర్డిఎ లవన్న, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker