chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :ధాన్యం కొనుగోలు వేగవంతం-అధిక కొనుగోలులు చేసిన అధికారులకు అవార్డులు-కలెక్టర్ వినోద్ కుమార్

బాపట్ల:డిసెంబర్ 10:-జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని, కొనుగోలు కేంద్రాల్లో అత్యధికంగా ధాన్యం కొనుగోలు జరిగే గ్రామాల సంబంధిత వ్యవసాయ సహాయకులు, పౌర సరఫరాల ఉప తహసిల్దార్లు, మండల తహసిల్దార్‌లకు అవార్డులు మరియు ప్రత్యేక సన్మానాలు అందజేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ప్రకటించారు. మంగళవారం పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల సంస్థ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ నెలలో ధాన్యం కొనుగోలు భారీగా జరిగే అవకాశం ఉందని తెలిపారు. ధాన్యం కోతకు ముందే అధికారులు గ్రామాలను సందర్శించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని ఆర్‌ఎస్‌కేల్లో విక్రయించేలా చైతన్యపరచాలని, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

డాక్టర్ వినోద్ కుమార్ వివరాలను వెల్లడిస్తూ, డిసెంబర్ 9వ తేదీ వరకు జిల్లాలో 4,329 మంది రైతులు 23,520 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆర్‌ఎస్‌కేల ద్వారా విక్రయించారని, దీనికి ప్రభుత్వం రూ.56 కోట్ల చెల్లింపు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 10.63 లక్షల గోనె సంచులను కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలులో మరింత వేగం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ధాన్యం కొనుగోలులో విశేషంగా పనిచేసిన అధికారులకు అరుదైన సన్మానాలు జరగనున్నట్లు ఆయన తెలిపారు.సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారి జమీర్ బాషా, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker