chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :21న పల్స్ పోలియో కార్యక్రమం-జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

గుంటూరు: డిసెంబరు 9:-ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ విషయంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. అనంతరం పల్స్ పోలియో ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.కలెక్టర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పల్స్ పోలియో చుక్కలు వేయాలని పిలుపునిచ్చారు. ఇటుక భట్టీలు, నిర్మాణ స్థలాలు, సంచార జాతులకు చెందిన కుటుంబాలు వంటి రిస్క్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. “రెండు చుక్కలు – నిండు ప్రాణాలు” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో పోలియో శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచిస్తూ, వైద్య ఆరోగ్య, అంగన్వాడీ, విద్యా, మున్సిపల్, డీ.ఆర్.డీ.ఏ, మెప్మా, సంక్షేమ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని కలెక్టర్ ఎత్తిచూపారు.

Guntur Local News :21న పల్స్ పోలియో కార్యక్రమం-జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 22.46 లక్షల జనాభాలో ఐదు సంవత్సరాల లోపు 2,14,981 చిన్నారులు ఉన్నారని తెలిపారు. మొత్తం 784 రిస్క్ ప్రాంతాలు గుర్తించి, 958 పోలియో బూత్‌లు, 16 ట్రాన్సిట్ పాయింట్లు, 6 బఫర్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 104 రూట్లు, 72 మొబైల్ టీంలు, 4,090 వ్యాక్సినేటర్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి 2,57,980 డోసులు, 12,899 వయల్స్ అవసరం కాగా, ఇప్పటికే 13,250 వయల్స్ అందాయని వివరించారు. మొత్తం 4,406 మంది వైద్య, విద్యా శాఖ సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు.తరువాత అధికారులు కలిసి పల్స్ పోలియో పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో ఇమ్యూనైజేషన్ అధికారి ఏ. శ్రావణ్ బాబు, డీసీఎంహెచ్ఓ రంగారావు, అదనపు డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. అన్నపూర్ణ, డీపీఎంఓ డా. కె. సుజాత, మెప్మా పీడీ టి. విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, డీ.ఆర్.డీ.ఏ పీడీ టి. విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారిణి సీ. రేణుక, జీఎంసీ సీఎంహెచ్ఓ డా. పి. శశికళ, ఐఎంఏ ప్రెసిడెంట్ డా. సేవాకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker