chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

Amaravathi news :ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళల వికాసానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం-చేనేత–జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత

అమరావతి : 11-12-25:-ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళల వికాసానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని చేనేత–జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. జాతీయ హస్తకళల వారోత్సవాల సందర్భంగా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన 2023, 2024 జాతీయ అవార్డుల్లో ఏపీకి ఐదు పురస్కారాలు లభించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాలకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహమే కారణమని అన్నారు.గురువారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి సవిత వివరాలు తెలియజేశారు.2023కు సంబంధించితోలు బొమ్మల తయారీలో డి. శివమ్మకు మహిళల విభాగంలో శిల్ప గురు అవార్డుకలంకారి హ్యాండ్ పెయింటింగ్‌లో విజయలక్ష్మికి జాతీయ హస్తకళ అవార్డు2024కు సంబంధించిఏటికొప్పాక బొమ్మల తయారీలో గోర్సా సంతోష్‌కు జాతీయ అవార్డుతోలు బొమ్మల తయారీలో కందాయ్ అంజన్నప్పకు,తోలుబొమ్మల క్రాఫ్ట్ విభాగంలో ఖండే హరనాథ్‌కు ప్రత్యేక ప్రస్తావన అవార్డులు లభించాయి.

అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందాయన్నారు. హస్తకళాకారుల శిక్షణ, మార్కెటింగ్ అవకాశాలు, ఆర్థిక భరోసా వంటి అంశాల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఈ పురస్కారాలకు మార్గం సుగమం చేశాయని మంత్రి పేర్కొన్నారు. కళాకారుల సంక్షేమం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు.13న శ్రీకాళహస్తిలో సన్మానంజాతీయ హస్తకళల వారోత్సవాల నేపథ్యంలో ఈ నెల 13న శ్రీకాళహస్తిలో అవార్డు గ్రహీతలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించనుందని సవిత తెలిపారు. అదే కార్యక్రమంలో 100 మంది హస్తకళాకారులకు ఒక్కొక్కరికీ రూ.10,000 విలువ చేసే టూల్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.అవార్డు గ్రహీతలకు మంత్రి సవిత అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో హస్తకళలకు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా ప్రభుత్వం కృషిని కొనసాగిస్తుందని తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker