chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

NTR Vijayawada Local News :పెనుగంచిప్రోలు మండలంలో రోడ్ల దయనీయ పరిస్థితిపై ప్రజల ఆవేదనసంవత్సర కాలంగా మారని దుస్థితి-కాస్త పట్టించుకోండి సారో అంటూ అధికారులకు మొర

ఎన్టీఆర్:జగ్గయ్యపేట:12-12-25:-పెనుగంచిప్రోలు మండలంలోని రోడ్ల పరిస్థితి రోజు రోజుకీ అధ్వానంగా మారిపోతున్న నేపథ్యంలో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుమ్మడిదుర్రు–అనిగండ్లపాడు–పెట్రోల్ బంక్ మార్గం, పెనుగంచిప్రోలు–వేమవరం రహదారి, అలాగే ముచింతల రోడ్డు, ముళ్లపాడు రహదారులు గత సంవత్సరం వరదల తరువాత పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఇప్పటికీ మరమ్మత్తులను చూడక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.గత ఏడాది వచ్చిన భారీ వరదలతో రహదారులలో పెద్ద ఎత్తున గోతులు ఏర్పడటంతో అధికారులు తాత్కాలికంగా మట్టి రోడ్లు వేసి వాహనాలు నడిచేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ దారుల్లో నిత్యం ట్రాఫిక్ అధికంగా ఉండటంతో మట్టి రోడ్లు కూడా కొద్ది రోజుల్లోనే మళ్లీ పాడైపోయాయి. కొద్ది చోట్ల అడుగు లోతు గుంటలు ఏర్పడి రెండు చక్రాలే కాదు నాలుగు చక్రాల వాహనాలు కూడా ప్రయాణించడం ప్రమాదకరమైందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది వచ్చిన కొత్త వరదలతో పరిస్థితి మరింత చేదరుగిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“ఇంతకాలంగా రోడ్లు పాడైపోయినా ఎందుకు మరమ్మత్తు పనులు చేపట్టడం లేదు? మా ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.ఇటీవలి నెలల్లో నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, మరమ్మత్తుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, ఆ నిధులతో రెండు రోడ్ల పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతా అత్యవసర మార్గాలపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు బలంగా కోరుతున్నారు

NTR JILLA.ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉండి ప్రాణాంతకంగా మారిన ముళ్లపాడు రోడ్డు, ముచింతల–గుమ్మడిదూర్రు–అనిగండ్లపాడు మార్గం, అలాగే పాత వేమవరం రహదారులను అత్యవసరంగా పునరుద్ధరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని, అధికారులను వినతిచేస్తున్నారు.“ప్రజల ఇబ్బందులను గుర్తించి వెంటనే మరమ్మత్తు పనులు ప్రారంభించాలని అధికారులు చర్యలు తీసుకోవాలి” అని స్థానికుల డిమాండ్.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker