chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆధ్యాత్మికంతెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

hyderabad :Vaibhava Venkateswara Swamy Temple, Miyapur – Dhanurmasam CelebrationsMiyapur Local News :వైభవ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ప్రశాంత్ నగర్, మియాపూర్ నందు ధనుర్మాస ఉత్సవాలు

hyderabad :Vaibhava Venkateswara Swamy Temple, Miyapur – Dhanurmasam CelebrationsMiyapur Local News :వైభవ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ప్రశాంత్ నగర్, మియాపూర్ నందు ధనుర్మాస ఉత్సవాలుప్రశాంత్ నగర్ మియాపూర్‌లో ధనుర్మాస ఉత్సవాలు :మియాపూర్:శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ప్రశాంత్ నగర్, మియాపూర్ నందు ధనుర్మాస ఉత్సవాలు డిసెంబర్ 16, 2025 నుంచి జనవరి 14, 2026 వరకు అత్యంత విశేషంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ధనుర్మాస సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 4.30 గంటలకు స్వామివారికి విశేష అర్చన, తిరుప్పావై సేవాకాలం ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం ప్రాకారోత్సవం, తీర్థప్రసాద గోష్ఠి జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శన భాగ్యం పొందవచ్చని పేర్కొన్నారు.Hyderabad Local news:CM రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

అదేవిధంగా డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని విశేష పుష్పాలంకరణతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.

ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 14వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ గోదా రంగనాధుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామానుజాచార్యులు మాట్లాడుతూ, ధనుర్మాసం శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన మాసమని తెలిపారు. ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయం జరిగే తిరుప్పావై సేవాకాలం, విశేష అర్చనల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు ఆయురారోగ్యాలు, కుటుంబ శాంతి, సకల శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేయడం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తంగా పేర్కొన్నారు.

అలాగే ధనుర్మాసం చివరి రోజున జరిగే శ్రీ గోదా రంగనాధుల కళ్యాణోత్సవంను దర్శించుకుంటే దాంపత్య సౌఖ్యం, సంతాన భాగ్యం, ఆర్థిక అభివృద్ధి లభిస్తాయని అర్చకులు వివరించారు. ఈ ఆలయంలో నిర్వహించే ధనుర్మాస ఉత్సవాలు శాస్త్ర సంప్రదాయబద్ధంగా, అత్యంత నియమ నిష్ఠలతో జరుగుతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని వారు కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker