chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

Eluru Local News :చింతలపూడి-జవహర్ నవోదయ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – డీఈఓ వెంకట లక్ష్మమ్మ

ఏలూరు జిల్లా:- చింతలపూడి నియోజకవర్గంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలు శాంతియుతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

శనివారం చింతలపూడి బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జవహర్ నవోదయ పరీక్ష కేంద్రాన్ని డీఈఓ వెంకట లక్ష్మమ్మ సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.

Eluru Local News :చింతలపూడి-జవహర్ నవోదయ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – డీఈఓ వెంకట లక్ష్మమ్మ

అనంతరం ఆమె సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని సందర్శించి అక్కడ నివసిస్తున్న పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.Elure Local News:చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా – పెండింగ్ జీతాలు, పీఎఫ్ విడుదల చేయాలని డిమాండ్

ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు మొత్తం 174 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నూజివీడు డివిజన్ డిప్యూటీ డీఈఓ డాక్టర్ పి.కె. సుధాకర్, చింతలపూడి మండల విద్యాశాఖ అధికారి రెండు కిరణ్ కుమార్‌తో పాటు ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker