chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: అమరజీవి త్యాగం మరువలేనిది

POTTI SRIRAMULU DEATH ANNIVERSARY IN GUNTUR

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. సోమవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, ఏపి హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషాలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని డిసెంబర్ 15న “ఆత్మార్పణ దినం“గా రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆయన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన స్పూర్తిగా నిలిచారన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని, అటువంటి నిస్వార్థ వ్యక్తుల త్యాగాలను నేటి తరానికి తెలియచేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని, తెలుగు ప్రజలు ఆయన త్యాగాలను నిత్యం స్మరించుకోవాలని తెలియచేశారు. తొలుత హిందూ కాలేజీ సిగ్నల్ దగ్గర పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించ్చారుకార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ బి. శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మేనేజర్ బాలాజీ బాష, సూపరిండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker