
బాపట్ల: డిసెంబర్ 16:-సెంబర్ 21న నిర్వహించనున్న NID–2025 పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధ్యక్షత వహించారు.
జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కోసం 1111 బూత్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 67 మొబైల్ టీమ్లు, 113 రూట్ సూపర్వైజర్లు, 4662 మంది వ్యాక్సినేటర్లు, 42 ట్రాన్సిట్ బూత్లు విధుల్లో ఉంటాయని చెప్పారు. 164 హై రిస్క్, మైగ్రేటెడ్ ప్రాంతాలను గుర్తించామని, అక్కడ 2556 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందని తెలిపారు.
బాపట్ల, రేపల్లె, వేమూరు, అద్దంకి, చీరాల, పర్చూరు నియోజకవర్గాలకు ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను నియమించారు. మూడు రోజుల పాటు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మునిసిపల్ కమిషనర్లు తమ సిబ్బందితో పూర్తిస్థాయిలో సహకరించాలని, పోలీస్ శాఖ మైక్ ప్రచారానికి అనుమతులు ఇవ్వాలని సూచించారు. విద్యుత్ శాఖ 24వ తేదీ వరకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీలు, స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, విద్యాశాఖ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు పోలియో ప్రచారంలో పాల్గొనాలని చెప్పారు.
రైల్వే, ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ట్రాన్సిట్ బూత్ల ఏర్పాటుకు సహకరించాలని, స్వచ్ఛంద సంస్థలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మీడియా విస్తృత ప్రచారం కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.Bapatla Local News
ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మరియు వివిధ ఆరోగ్య కార్యక్రమాల బాధ్యులు పాల్గొన్నారు.










