chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: పారిశుధ్యం క్షీణిస్తే చర్యలు తప్పవు

GUNTUR COMMISSIONER VISIT DEVELOPMENT PROGRAMMES

గుంటూరు నగరంలో ఉదయం 7 గంటలలోపే మెయిన్ రోడ్ల స్వీపింగ్ పూర్తి కావాలని, 7 తర్వాత ఇంటింటి చెత్త సేకరణ జరగాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. బుధవారం సంగడి గుంట, కాకాని రోడ్, వాసవి నగర్, సాయి నగర్, బస్టాండ్, నందివెలుగు రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉదయం 7 గంటల తర్వాత ట్రాఫిక్ పెరుగుతుందని, కనుక ఆ సమయంలోపే మెయిన్ రోడ్ల శుభ్రం పూర్తి అయ్యేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు భాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజారోగ్య కార్మికులు ఇంటింటి చెత్త సేకరణకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా తడిపొడిగా వేరుగా ఇవ్వాలని గృహస్తులకు తెలియచేయాలన్నారు. సంగడి గుంట లాంచేస్టర్ రోడ్ పై బిర్యానీలు వండుతూ రోడ్ల పై గోతులకు కారణం అవుతున్న వాటిని తొలగించాలని, పునరావృతం చేస్తే భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఒమేగా హాస్పిటల్ వెనుక రోడ్ లో పిజిఆర్ఎస్ లో అందిన ఫిర్యాదు మేరకు పరిశీలించి, ఆయా నిర్మాణాలకు ఆస్తి పన్ను విధించాలని, ప్లాన్ లేకుంటే తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. వాసవి నగర్, సాయి నగర్, నందివెలుగు రోడ్ ల్లో ప్రజల నుండి వివిధ వేదికల ద్వారా అందిన ఫిర్యాదుల మేరకు పరిశీలించి, ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, డ్రైన్ల, కచ్చా రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నంది వెలుగు రోడ్ లో రైల్వే ట్రాక్ నుండి జాతీయ రహదారి వెంబడి డ్రైన్, రోడ్ ఆక్రమణలను తొలగించాలన్నారు. శాంతి నగర్ వైపు పీకలవాగు పై కల్వర్ట్ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని డిఈఈ వెంకటరమణను ఆదేశించారు. బస్టాండ్ దగ్గరలోని ఎన్టీఆర్ విగ్రహం వెనుక ఖాళీ స్థలంలో బిటి రోడ్ నిర్మాణం చేపట్టాలని, నగరంలో జంక్షన్లలో ఉన్న ప్రతి ఫౌంటేను వర్కింగ్ లో, కమ్యూనిటి, పబ్లిక్ టాయ్ లెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పర్యటన డిఈఈలు కళ్యాణరావు, హనీఫ్, వెంకటరమణ, ఆర్ఓ సాదిక్ బాష, ఎస్ఎస్ సాంబయ్య, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker