chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :ఏసుక్రీస్తు క్షమా గుణాలు, సూక్తులు నేటి సమాజానికి మార్గదర్శకం-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

బాపట్ల: డిసెంబర్‌ 19:-ప్రేమ, దయ, క్షమ గుణాలకు ప్రతిరూపమైన ఏసుక్రీస్తు సూక్తులు నేటి సమాజానికి మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ వి అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రిస్టియన్‌, ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బాపట్ల పట్టణంలోని షాదీఖానా భవన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు, తేనీటి విందు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రిస్మస్ కేకును కట్ చేసి క్రైస్తవ పెద్దలు, పాస్టర్లకు పంచిపెట్టారు. అనంతరం క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు.Bapatla Local News

కలెక్టర్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు ప్రభువు అంటేనే ప్రేమ, దయ, క్షమ గుణాల సమాహారమని అన్నారు. ఆయన పుట్టినరోజును పండుగగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. క్రిస్మస్ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. జిల్లా ప్రజలంతా శాంతి, సమాధానాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, తారతమ్యాలు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారికంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, క్రిస్టియన్ మిషనరీ పాఠశాలల్లో విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, విజ్ఞానంలో ముందుండేవారని, ఏసుక్రీస్తు సూక్తులు వారిపై గాఢమైన ప్రభావం చూపాయని తెలిపారు. అదే స్ఫూర్తితో క్రైస్తవ సోదరులు సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలన్నారు.

జిల్లా క్రిస్టియన్‌, ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ అధికారి జగన్నాథం పార్థసారథి మాట్లాడుతూ క్రిస్మస్ ఆనందం అందరిలో నింపాలని, ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు.

బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా మాట్లాడుతూ మానవాళి రక్షణ కోసమే ఏసుక్రీస్తు జన్మించారని, ఆయన చూపిన మార్గం అనుసరణీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేజర్ ఏసు పాదం వాక్యోపదేశం చేయగా, డీఆర్‌డీఏ పీడీ లవన్న, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, తహసిల్దార్ షాలీమా, ఫాదర్ ఇన్నయ్య, రెవరెండ్ పి. వరబాబు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker