chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :ఉల్లాస్ అక్షర ఆంధ్రను లక్ష్యాల మేరకు అమలు చేయాలి-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

గుంటూరు: డిసెంబరు 30:-జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలవుతున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.

Guntur Local News :ఉల్లాస్ అక్షర ఆంధ్రను లక్ష్యాల మేరకు అమలు చేయాలి-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సీఎంఎంలు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. Guntur Local newsజిల్లాలో గుర్తించిన నిరక్షరాస్యులకు అక్టోబరు నెల నుంచి ఉల్లాస్ అక్షర ఆంధ్ర ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. మొత్తం వంద గంటల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమం మార్చి వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. లెసన్ ప్లాన్లు, బోధనా విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. శిక్షణ కాలం ముగిసే నాటికి నిర్దేశిత లక్ష్యాల మేరకు ప్రతి నిరక్షరాస్యుడు ప్రాథమికంగా చదవడం, వ్రాయడం నేర్చుకుని అక్షరాస్యులుగా మారేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో సీఎంఎంలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏపీఎంలు, ఏపీఓలు ప్రతిరోజూ తరగతుల నిర్వహణ వివరాలను తప్పనిసరిగా నివేదించేలా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పర్యవేక్షించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker