chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :తెలుగుదేశం పార్టీ తరఫున రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులకు అందజేస్తున్నా ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు

బాపట్ల-తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా పథకం ద్వారా రూ.100 సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు.

బాపట్ల నియోజకవర్గం, బాపట్ల మండలం గుడిపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు యంపరాల ఆంజనేయులు ప్రమాదవశాత్తు మరణించడంతో, ఆయన కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరఫున రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని, పసుపు సైన్యం సంక్షేమం కోసం వందల కోట్లు వెచ్చిస్తున్న ఏకైక పార్టీ టిడిపి అని పేర్కొన్నారు.TODAY BAPATLA NEWS

కేవలం రూ.100తో టిడిపి సభ్యత్వం తీసుకుంటే రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం కార్యకర్తల పట్ల పార్టీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని చూసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీనే అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker