chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

vijayawada Local News :మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో 3 వ తేదీ శనివారం నుండి 10 రోజుల పాటు ఖాదీ ఎగ్జిబిషన్

విజయవాడ:-ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ వేదికగా 10 రోజుల పాటు ఖాదీ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకులు డా. ఎస్. గ్రీప్ తెలిపారు.

స్థానిక పంట కాలువ రోడ్డులోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఈ నెల 3వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొంటారని తెలిపారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, కేవీఐబీ సీఈవో కట్టా సింహాచలం, పరిశ్రమల శాఖ సంచాలకులు శుభం బన్సల్, ఎస్ఎల్బీసీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస దాస్యం తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో 100కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖాదీ వస్త్రాలు, పొందూరు ఖాదీ, ధర్మవరం సిల్క్, కలంకారీ ప్రింటింగ్, చెక్క బొమ్మలు, హస్తకళాకారుల చేతితో తయారైన అనేక రకాల ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

గ్రామీణ కళాకారుల జీవనోపాధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఖాదీ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎగ్జిబిషన్‌ను సందర్శించి కొనుగోలు చేసి చేతివృత్తుల వారికి చేయూతనివ్వాలని డా. ఎస్. గ్రీప్ కోరారు.Vijayawada Localnews

ఈ సందర్భంగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సహాయ సంచాలకులు ఆర్.ఎల్.ఎన్. మూర్తి మాట్లాడుతూ, పీఎంఈజీపీ పథకం కింద తయారైన ఉత్పత్తులకు ఈ ఎగ్జిబిషన్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. తయారీదారులు, కళాకారుల ప్రతిభను ప్రజలకు చేరువ చేసేందుకే ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker