chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Chirala Local News :రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం

వేటపాలెం:-గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి దిశానిర్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏపీ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ రాజముద్రతో, క్యూఆర్ కోడ్‌లతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని ప్రారంభించింది.

ఈ సందర్భంగా వేటపాలెం మండలం పందిళ్ళపల్లి పంచాయితీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.

Chirala Local News :రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం

గత ప్రభుత్వ హయాంలో జగన్ ఫోటోతో జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాల్లోని లోపాలను సవరించి, ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్‌లతో రూపొందించిన కొత్త పాసుపుస్తకాలను రైతులు, భూయజమానులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రీ–సర్వే నిర్వహించి, వెబ్‌ల్యాండ్ వివరాలతో అనుసంధానంగా మొత్తం 21.86 లక్షల కొత్త పాసుపుస్తకాలను ముద్రించారని వివరించారు.

Chirala Local News :రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం

రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం కలిగించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి విముక్తి కల్పించి, రైతులకు భూ హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మాలకొండయ్య స్పష్టం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.Chirala Local News

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి నాసిక వీరభద్రయ్య, పందిళ్ళపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు బాలచంద్ర, వేటపాలెం మండల అధ్యక్షులు రామాంజనేయులు, పందిళ్ళపల్లి పీఏసీఎస్ చైర్మన్ పల్లప్రోలు శ్రీనివాసరావు, ఆర్డీవో చంద్రశేఖర్, వేటపాలెం ఎమ్మార్వోతో పాటు లబ్ధిదారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker